Telangana : సబితపై సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు.. దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసగా గురువారం రేవంత్‌ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది.

New Update
Telangana : సబితపై సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు.. దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్

CM Revanth Reddy : తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమవేశాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy).. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy), సునితా లక్ష్మారెడ్డిలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ పార్టీ నేతలు రేవంత్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసగా గురువారం రేవంత్‌ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ.. జీవితం బస్టాండ్‌ పాలవుతుందంటూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రతిఒక్కరూ ఖండించాలని బీఆర్ఎస్‌ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు.

Also Read: రాజవంశం నుంచి డిప్యూటీ సీఎం వరకు.. తెలంగాణ కొత్త గవర్నర్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరీ మనసులు నొప్పించాయని.. జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి మహిళకు ఇది అవమానకరమని మండిపడ్డారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

Also Read: సబిత అంటేనే మోసం.. మరోసారి రేవంత్ సంచలన కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు