Telangana: కమిషన్ కోసం కాంగ్రెస్ నకిలీ బీర్లకు అనుమతులిస్తోంది.. క్రిశాంక్ సంచలన ఆరోపణలు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న కొత్త మద్యం బ్రాండ్లపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరు తయారీ కంపెనీలకు అనుమతులు ఇస్తుందని మండిపడ్డారు. కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.

New Update
Telangana: కమిషన్ కోసం కాంగ్రెస్ నకిలీ బీర్లకు అనుమతులిస్తోంది.. క్రిశాంక్ సంచలన ఆరోపణలు!

BEER: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేవేశపెట్టబోతున్న కొత్త మద్యం బ్రాండ్లపై సంచలన ఆరోపణలు చేశారు. కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సోమ్ డిస్లరీస్‌కి సంస్థ రాష్ట్ర ఖజానాకు గండికొడుతూ, ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ, కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ఆరితేరిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమన్నారు. దయచేసి కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానికరమైన కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటు లోకి తేవద్దని డిమాండ్ చేశారు.

అనుమతులను తక్షణమే రద్దు చేయండి..
అలాగే 2024 మే 21న మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పి ఎవరన్నా అలాంటి వార్తలు రాస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ 27 మే 2024న మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధాన్ని బహిర్గతం చేస్తూ సోం డిస్లరీస్ అనే సంస్థకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై మీడియా సమావేశం పెట్టిన అనంతరం.. జూపల్లి కృష్ణారావు నిజాన్ని ఒప్పుకొని సోమ్ డిస్లరీస్‌కు అనుమతులు ఇవ్వడం వాస్తవమే అన్నారు. కానీ దానిపై మంత్రికి ఎలాంటి సమాచారం లేదని, అది బేవరేజెస్ కార్పొరేషన్ సొంత నిర్ణయం అని బాధ్యత రహితంగా పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారని విమర్శలు గుప్పించారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి సోం డిస్లరీస్‌‌కి ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేస్తూ విక్రయదారుల ఆరోగ్యాన్ని కాపాడుతారని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు