KTR : కాంగ్రెస్‌కి బీజేపీ జాకీలు పెట్టింది.. కేటీఆర్ పంచులు!

బీజేపీ కాంగ్రెస్‌కి జాకీలు పెట్టి మద్దతుగానిలుస్తుందని అన్నారు కేటీఆర్. బండి సంజయ్ మొన్న కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

KTR To Delhi: కవిత అరెస్ట్.. ఢిల్లీకి కేటీఆర్
New Update

MLA KTR : తెలంగాణ(Telangana) లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(Minister KTR). తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ను ఎమ్మెల్సీగా నియమిస్తూ గవర్నర్ తమిళిసై(Tamilisai) తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై పనిచేస్తున్నాయని ఆరోపణలు చేశారు.

ALSO READ: ఏంఐఏంలోకి డీకే అరుణ.. వంశీ చంద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అప్పుడు అలా... ఇప్పుడు ఇలా..

గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ గారిని గత ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తే... రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి వారి అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించిందని గుర్తు చేశారు. కానీ ఈరోజు వస్తున్న వార్తల ప్రకారం ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాం గారిని ఎట్లా ఆమోదిస్తున్నారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి లెటర్ రాగానే ఆగమేఘాల మీద ఎలా సంతకం చేసారో గవర్నర్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు, సామాజిక ఉద్యమంలో పాల్గొన్న సత్యనారాయణ గారికి రాజకీయ నేపథ్యం అడ్డంకి అయితే ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాంను ఏ రకంగా ఆమోదించారో ప్రజలకు గవర్నర్ వివరించాలని అన్నారు.

రేవంత్ రెడ్డికి కాదు..

రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు.. రాజ్ భవన్(Raj Bhavan) నడుస్తున్నది.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని గవర్నర్ కు గుర్తు చేశారు కేటీఆర్. మీరు బాధ్యులు రేవంత్ రెడ్డికి కాదు రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యంకు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా అనే విషయం చెప్పాలి అని అన్నారు. ఈ నామినేషన్ల అంగీకారం కాంగ్రెస్ - బీజేపీ కుమ్మక్కును తెలియజేస్తుందని అన్నారు.

సర్పంచుల పదవీకాలం పొడిగించాలి..

సర్పంచుల పదవీకాలం పొడిగించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు కేటీఆర్. ప్రజల తరఫున ఎన్నికైన సర్పంచుల పదవీకాలం పొడగించాలి.. కాని ప్రత్యేక ఇంచార్జీలను పెట్టవద్దని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాలన చేయాలి కానీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఇంచార్జీలు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు.

రెండు సంవత్సరాల పాటు కరోనా సమయంలో వారి పరిపాలన సమయం పోయింది.. కాబట్టి పదవి కాలాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరం మేర పొడిగించాలని అన్నారు. లేదా తిరిగి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే వరకు వారి కాలాన్ని పొడిగించాలని కోరారు. కేవలం మంత్రులు అందుబాటులో లేరు, కొత్తగా ఎన్నికైన మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు అంటూ సర్పంచులు పూర్తి చేసిన కార్యక్రమాల ప్రారంభాన్ని కూడా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు.

Also Read : సుమతీ శతకం పద్యంతో కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్

బీజేపీ కాంగ్రెస్ కి జాకీలు..

కాంగ్రెస్ - బీజేపీ(Congress-BJP) కుమ్మక్కు ప్రజలందరికీ తెలుస్తుందని అన్నారు కేటీఆర్. 'ఒకటే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించారు. ఒకటే కోటా కింద ఉన్న ఎమ్మెల్సీలకి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించారు రేవంత్ రెడ్డి పోయి అమిత్ షాను కలవగానే ఓకే ఎన్నిక కాకుండా వేరువేరుగా ఎన్నికలు జరిగేటట్టు నిర్వహించారు. ఒకేసారి ఎన్నిక జరిగితే ఒకటి బీఆర్ఎస్ కి, మరొకటి కాంగ్రెస్ కి వచ్చేది. బీజేపీ కాంగ్రెస్ కి జాకీలు పెట్టి మద్దతుగానిలుస్తుంది. కాంగ్రెస్ - బీజేపీకి ఫెవికాల్ బంధమని ప్రజలకు తెలుస్తుంది. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారు. నిన్న గుంపు మేస్త్రి కూడా ఇదే మాట చెప్పారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

DO WATCH:

#ktr #bjp #bandi-sanjay #brs-party #congress-party #governor-tamilisai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe