Fight Over Water Between BRS and Congress: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో వాటర్ వార్ అంతకంతకూ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో తన సత్తా చూపించాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో బలంగా ఢీకొంటోంది. అటు కాంగ్రెస్ ప్రతివిమర్శలతో బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే వైట్పైపర్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరిట బీఆర్ఎస్ గత 10ఏళ్ల పాలనను లక్ష్యంగా చేసుకున్నది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అస్త్రమైన కాళేశ్వరం ప్రాజెక్టే ఈ లోక్సభ ఎన్నికల్లోనూ హస్తం ఆయుధం కానుంది. ప్రాజెక్టు చుట్టూ అవినీతి ఉందని.. అది బహిరంగంగా బయటపెడతామని ప్రణాళిక సిద్ధం చేసుకున్న రేవంత్ సర్కార్.. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేయనుంది. అదే సమయంలో నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనున్నారు.
పూర్తిగా చదవండి..BRS vs Congress: ముదురుతున్న వాటర్ వార్.. పోటాపోటీగా టూర్లు, సభలు!
అటు మేడిగడ్డకు రేవంత్.. ఇటు నల్గొండకు కేసీఆర్ వెళ్తుండడంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై బీఆర్ఎస్ టార్గెట్గా కాంగ్రెస్ విమర్శలు గుప్పించగా.. లోక్సభ ఎన్నికలకు కూడా ఇదే అస్త్రంతో ముందుకువెళ్తోంది.
Translate this News: