Andhra Pradesh:ఏపీకి సూపర్ గుడ్ న్యూస్.. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు?

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న వేళ.. ఏపీ సూపర్ గుడ్ న్యూస్ అందుతోంది. భారీ రిఫైనరీ ప్రాజెక్టును ప్రారంభించాలని బీపీసీఎల్ అనుకుంటున్నట్లు సమాచారం. రూ.50 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

Andhra Pradesh:ఏపీకి సూపర్ గుడ్ న్యూస్.. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టు?
New Update

BPCL Refinery: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి పెద్ద పెద్ద ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. తాజాగా బీపీసీఎల్ ఆంధ్రాలో భారీ ప్రాజెక్టు స్టార్ చేయడానికి యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.రూ.50 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ మూడు రాష్ట్రాలను పరిశీలిస్తుండగా.. అందులో ఏపీ కూడా ఉంది అని అంటున్నారు.

స్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ భారీ ప్రాజెక్టు ఏపీకి రావాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం 50 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే ఈ రిఫైనరీ నెలకొల్పేందుకు మూడు రాష్ట్రాలను బీపీసీఎల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఒకచోట ఈ రిఫైనరీని ప్రారంభించాలని బీపీసీఎల్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశానికి మరిన్ని రిఫైనరీలు అవసరం ఉంది. అందులో భాగంగా బీపీసీఎల్ తూర్పు తీరంలో లేదా పశ్చిమ తీరంలో మరొక రిఫైనరీని ప్లాన్ చేస్తోంది. చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి" అని ఒక అధికారి చెప్పినట్లు ఎకనమిక్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. కొత్త రిఫైనరీ కోసం ఏపీ, యూపీ, గుజరాత్ రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్లు సమచారం.

మరోవైపు బీపీసీఎల్ ఛైర్మన్ కృష్ణ కుమార్ సైతం ఇటీవల ఇదే విషయంపై మాట్లాడారు. 2029 నాటికి బీపీసీఎల్ తన సామర్థ్యాన్ని 45 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బీపీసీఎల్‌కు ముంబై, కోచి, మధ్యప్రదేశ్‌లోని బినాలో రిఫైనరీలు ఉన్నాయి. కొత్త రిఫైనరీ ఏర్పాటు కోసం తూర్పు తీర ప్రాంతం, పశ్చిమ తీరప్రాంతాలను బీపీసీఎల్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం. ఎకనమిక్స్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఏపీలో రూ.50 వేలకోట్ల పెట్టుబడి ఒకేసారి వస్తే.. స్థానికులకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని.. వేల మందికి పరోక్షంగా లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ భారీ ప్రాజెక్టును ఏ మేరకు ఏపీకి తీసుకువస్తారనేదీ చూడాలి మరి.

Also Read:Chandra Babu:తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

#bpcl #project #refinery #andhra-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి