Telangana Elections: ఈసారి ఫిక్స్.. తెలంగాణలో అధికారంపై బీఎల్ సంతోష్ సంచలన కామెంట్స్..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? అంత సీన్ ఇప్పుడుందా? అని సొంత పార్టీ నేతలే ఊగిసలాడుతున్న వేళ.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నో మోర్ డౌట్స్.. అధికారం మనదే' అంటూ ఘంటాపథంగా తేల్చి చెప్పారు. కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు.. కథ మొత్తం మనదే ఉంటుందని కామెంట్స్ చేశారు.

New Update
Telangana Elections: ఈసారి ఫిక్స్.. తెలంగాణలో అధికారంపై బీఎల్ సంతోష్ సంచలన కామెంట్స్..

BL Santhosh Comments on Telangana Elections: తెలంగాణలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తుందా? అంత సీన్ ఇప్పుడుందా? అని సొంత పార్టీ నేతలే ఊగిసలాడుతున్న వేళ.. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్(BL Santhosh) సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నో మోర్ డౌట్స్.. అధికారం మనదే' అంటూ ఘంటాపథంగా తేల్చి చెప్పారు. కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు.. కథ మొత్తం మనదే ఉంటుందని కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఘట్కేసర్‌లో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన బీఎల్ సంతోష్.. పార్టీ శ్రేణుల్లో ఉన్న అనుమానాలను పటాపంచల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అధికారం దక్కించుకోవడంపై కీలక కామెంట్స్ చేశారు.

తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీనే అధికారంలో ఉంటుందని పార్టీ శ్రేణులకు చెప్పారు బీఎల్ సంతోష్. త్వరలో తెలంగాణలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని, అధికారం బీజేపీనే వరిస్తుందని పూర్తి విశ్వాసంతో ప్రకటించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను, మీడియాలో వస్తున్న వార్తా కథనాలను నమ్మొద్దంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీఎల్ సంతోష్. అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయించేపు విషయంపైనా క్లారిటీ ఇచ్చారు బీఎల్ సంతోష్. టికెట్స్ నిర్ణయం ఢిల్లీలో కాదని, ఇక్కడే(హైదరాబాద్) నిర్ణయించడం జరుగుతుందని స్పష్టం చేశారాయన.

Also Read:

ఆ బాధ నీకెందుకయ్యా రేవంతు.. ఎంపీ అరవింద్ మాస్ కామెంట్స్..

కాంగ్రెస్‌ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!

Advertisment
తాజా కథనాలు