RBI New Rules: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో రుణాలు కాస్త ఇబ్బందికరంగా మారనున్నాయి. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు పలు హోం లోన్స్ (Home Loans), ఈఎంఐలను (EMI) పెంచుతాయి. కొత్తగా లోన్స్ తీసుకునేందుకు దరఖాస్తు చేసుకునేవారి అర్హత తగ్గుతుంది. రుణాలు తీసుకునేవారికి ఫిక్డ్స్ వడ్డీ రేటు నుంచి ఫ్లోటింగ్ వడ్డీరేటుకు మార్చుకునే అవకాశం ఇవ్వాలని ఆర్బిఐ ఈ మధ్య నిర్వహించిన ద్రవ్యపరపతి సమీక్ష సమావేశంలో వెల్లడించింది. దీంతో ఇక నుంచి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు లోన్లు మంజూరు చేసే సమయంలో వీటికి సంబంధించిన అదనపు ఛార్జీలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో ముందే రుణగ్రహీతలకు వెల్లడించాల్సి ఉంటుంది. అంటే రుణగ్రహీతలు తమ రుణంపై వడ్డీరేటును ఫిక్స్డ్ రేటు నుంచి ఫ్లోటింగ్ రేటుకు మార్చుకోకున్నా లేదంటే ఫ్లోటింగ్ రేట్ నుంచి ఫిక్స్డ్ రేట్ కు మార్చుకున్నా ఎంత ఛార్జీ వసూలు చేయాలి…భవిష్యత్తులో వడ్డీ రేటు ఎంత పెరుగుతుంది, ఈఎంఐ ఎంత పెరుగుతుందనే వివరాలు తప్పకుండా ముందే వెల్లడించాల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి..EMI : లోన్లు తీసుకునేవారికి బిగ్ షాక్…పెరగనున్న ఈఎంఐలు..!!
గృహ రుణాలు, ఈఎంఐలకు సంబంధించి ఆర్ బిఐ కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీంతో లోన్స్ పొందడం కష్టంగా మారనుంది. ఈఎంఐలు కూడా భారీగానే పెరగనున్నాయి. ఆర్ బిఐ కొత్త రూల్స్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Translate this News: