/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/arrest.jpg)
TDP Office Attack Case : టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ (YCP) నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో లేళ్ల అప్పిరెడ్డి, రఘురామ్, ఆర్కే, సజ్జల, దేవినేని అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం వారికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అలాగే చంద్రబాబు (CM Chandrababu) నివాసంపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) కు కూడా ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
Also Read : కీ బోర్డ్ ప్లేయర్ నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్డ్ గా.. మెలోడీ బ్రహ్మ ఎవర్ గ్రీన్ జర్నీ ఇదే!