SBI Alert : ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్...రేపు యూపీఐ సేవలకు అంతరాయం..!!

ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ 26న బ్యాంక్ కు సెలవు ఉంది. ఈ రోజు కొద్దిసేపు యూపీఐ సేవలను పొందలేరు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనోలైట్, ఏటీఎం వంటి సర్వీసులను పొందవచ్చని తెలిపింది.

New Update
SBI Alert: ఖాతాదారులకు ఎస్​బీఐ అలర్ట్​...ఆ సర్వీసులు బంద్..!!

ఎస్బీఐ వినియోగదారులకు ముఖ్యగమనిక. రేపు బ్యాంకుకు హాలీడే ఉంది. సోమవారం నవంబర్ 27న కూడా బ్యాంకు సెలవు ఉంది. ఆ రోజు గురునానక్ జయంతి సందర్బంగా ఆ రోజు బ్యాంకులు పని చేయవు. అయితే మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉంటే..ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దేశీయఅతిపెద్ద బ్యాంకుల్లో ఒక్కటైన ఎస్బీఐ తన వినియోగదారులకు కీలక సమాచారాన్ని అందించింది. బ్యాంకు యూపీఐ సర్వీసులకు అంతరాయం కలిగే అవకాశం ఉందని వెల్లడించింది. అందుకే ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. యూపీఐ ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉండదో తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఎస్బీఐ తన వినియోగదారులకు నవంబర్ 26న కొంతసేపు యూపీఐ సేవల్లో అంతరాయం కలుగుతుందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఇంటర్నెట్ బ్యాకింగ్, యోనో లైట్, ఏటీఎం వంటి సర్వీసులను యాధావిధిగా పొందవచ్చని బ్యాంకు వెల్లడించింది. టెక్నాలజీ అప్ గ్రేడ్ కారణంగా యూపీఐ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని బ్యాంకు ఈ మేరకు ట్విట్టర్ పోస్టు ద్వారా వెల్లడించింది.

కాగా ఎస్బీఐ ట్వీట్ చేసిన ప్రకారం..టెక్నాలజీ అప్ గ్రేడ్ కారణంగా యూపీఐ సేవలు నవంబర్ 26న రాత్రి 1.30నుంచి 3గంటల వరకు పనిచేయవని తెలిపింది. ఈ సమయంలో యూపీఐ మినహాఇతర డిజిటల్ ఛానెల్స్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యోనోలైట్, యోనో, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయని వివరణ ఇచ్చింది. అందుకే బ్యాంకు కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: పవర్‎గ్రిడ్‎లో 203పోస్టులకు రిక్రూట్‎మెంట్…ఇలా అప్లయ్ చేసుకోండి…!!

నవంబర్ నెల చివరిలో అంటే రేపటి నుంచి బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. నవంబర్ 25వ తేదీన నాలుగో శనివారం ఉంది. అందుకే ఆరోజు బ్యాంకులకు సెలవు ఉంది. ఇంకా నవంబర్ 26వ తేదీ ఆదివారం. ఆ రోజు ఎలాగో సెలవు ఉంటుంది. ఇక 27వ తేదీ సోమవారం ఈరోజు గురునానక్ జయంతి. అందుకే ఆరోజు బ్యాంకులకు సెలవు. అలా ఆ విధంగా బ్యాంకులకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి. అందుకే మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే..ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ సెలవుల అనుగుణంగా బ్యాంకింగ్ పనులు చూసుకోండి. సాధారణంగా నాలుగో శనివారం, ఆదివారం బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే ఈ సోమవారం కూడా బ్యాంకు బంద్ ఉంది కాబట్టి ఈ విషయం గుర్తు పెట్టుకోండి. లేదంటే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

అయితే బ్యాంకుకు సెలవులు ఉన్నా కూడా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే చాలా బ్యాంకులు ఇప్పుడు ఆన్ లైన్ సర్వీసును ఇస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా సులభంగానే బ్యాంక్ సేవలు పొందవచ్చు. మనీ ట్రాన్స్ ఫర్, బిల్లు పేమెంట్స్ వంటి సేవలు సులభంగానే చేసుకోవచ్చు. అయితే బ్యాంకులు అధిక మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసుకోవాలని భావిస్తే మాత్రం కచ్చితంగా బ్రాంచ్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇతరాత్ర సేవలకు బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సిందే.

Advertisment
తాజా కథనాలు