Bandi Sanjay Open Letter to Karimnagar Public: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందేనని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ (BRS) పార్టీ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను నిండా ముంచితే, ఆశలు కల్పిస్తూ హడావుడి చేయడమే తప్ప కాంగ్రెస్ (Congress) చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ రెండు కుటుంబ పార్టీలేనని ఫైర్ అయ్యారు. ఆ చీడను వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ హితం కోసం అబ్కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ (Modi Govt) సర్కార్ నినాదంతో… మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకై జరుగుతున్న ఈ మహాయాగంలో మరోసారి సమిధగా మారడానికి కరీంనగర్ బిడ్డ సిద్ధమయ్యాడని చెప్పుకొచ్చారు బండి. మీ చేతిలో రెపరెపాలాడే కాషాయ జెండాగా మారడానికి, మీ ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా (Prajahitha Yatra) మీ గడపకొస్తున్నానని తెలిపారు. ఆశీర్వదించండంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే.. బండి సంజయ్ బహిరంగ లేఖ!
మీకోసం ప్రజాహిత యాత్రనై వస్తున్నా ఆశీర్వదించండంటూ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని ఫైర్ అయ్యారు. ఎంపీగా ఐదేళ్లలో కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తెచ్చానని చెప్పారు బండి.
Translate this News: