Bandi Sanjay: కాళేశ్వరంపై కాంగ్రెస్ డ్రామాలు.. కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలు: బండి సంజయ్

సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలాడుతున్నయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi Sanjay: కాళేశ్వరంపై కాంగ్రెస్ డ్రామాలు.. కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలు: బండి సంజయ్
New Update

MP Bandi Sanjay: తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు హెలికాప్టర్ లో కాళేశ్వరం వెళ్లొచ్చారని.. ఇంజనీరింగ్ నిపుణుల బృందం వెళ్లి విచారణ జరిపి నివేదిక కూడా ఇచ్చిందని.. కేంద్ర బృందం కూడా ప్రాజెక్టును సందర్శించి నివేదిక ఇచ్చిందని తెలిపారు. అయితే, మళ్లీ సీఎం సహా మంత్రులంతా వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, క్రిష్ణా నీటిపై నల్గొండలో సభ పేరుతో బీఆర్ఎస్ నాటకాలాడుతున్నయ్ అని విమర్శలు గుప్పించారు.విలువైన అసెంబ్లీ సమయాన్ని వ్రుధా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారంటూ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వ్రుధా చేసిన కేసీఆర్ (KCR) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేశానని ముక్కు నేలకు రాసి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అట్లాగే ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ కోరాలన్నారు.

దేశమంతా చర్చ జరుగుతోంది..

ప్రజాహిత యాత్రలో (Prajahita Yatra) భాగంగా 4వ రోజు మధ్యాహ్నం కోనరావుపేట మండల కేంద్రానికి వచ్చిన బండి సంజయ్ కు స్థానిక ప్రజలు పూలు చల్లి, హారతిపట్టి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన బండి సంజయ్ (Bandi Sanjay) స్థానికులను ఉద్దేశించి ప్రసగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై నిప్పులు చెరిగారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డ్రామాలను ఎండగట్టారు. మీకోసం బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశారని దేశమంతా చర్చ జరుగుతోందన్నారు. మోదీ (PM Modi) ప్రభుత్వం 2.4 లక్షల ఇండ్లు తెలంగాణకు ఇస్తే.. కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూం కట్టియ్యలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కోసం 16 వందల కిలోమీటర్లు తెలంగాణ మొత్తం పాదయాత్ర చేశానని.. త్యాగాలు మేం చేస్తే భోగాలు కాంగ్రెస్ అనుభవిస్తోందని ధ్వజమెత్తారు.ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ రూ.2లక్షలు, ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు బంధు (Rythu Bandhu) ఇవ్వలేదని అన్నారు. 6 గ్యారంటీలకు దిక్కులేదు.. మీరు ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ చేసిన మేలు ఏంది? అని నిలదీశారు.

Also Read: మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా తేల్చేద్దాం పదండి: రేవంత్ రెడ్డి

చాలా బాధాకరం..

'మోదీ ప్రభుత్వం తెలంగాణ కోసం భారీ ఎత్తున నిధులిచ్చింది. ఒక్క వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధికి రూ.575 కోట్ల 91 లక్షల రూపాయలిచ్చింది. ఈ ఒక్క మండలానికి ఉపాధి హామీ కింద రూ.48 కోట్ల 25 లక్షలిచ్చింది. రోడ్ల మెటీరీయల్ కోసం 23 కోట్ల 25 లక్షలు, మొక్కల పెంపకానికి 33 కోట్ల 91 లక్షలిచ్చింది. ఆ నిధులేమైనయని అడిగితే వర్షాలకు మొక్కలు కొట్టుకుపోయాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నరు. మీరే ఆలోచించండి. ఇతర పనుల కోసం రూ.19 కోట్ల 52 లక్షలు, చెత్త సేకరణ కోసం రూ.16 లక్షలు, టాయిలెట్ల కోసం 2 కోట్లకుపైగా, కిసాన్ సమ్మాన్ నిధి (Kisan Samman Nidhi) రోడ్ల కోసం రూ.3 కోట్లు ఇచ్చినం. కొనరావుపేట గ్రామానికి రూ.9 కోట్లకుపైగా నిధులిచ్చినం. బండి సంజయ్ చెప్పింది తప్పయితే నాపై కేసు పెట్టండి. అట్లాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను మీరేమిచ్చారని నిలదీయండి… మేం ఇన్ని పనులు చేస్తుంటే.. ఇన్ని నిధులు ఇస్తుంటే బీజేపీకి ఓటేయకపోవడం ఎంత బాధాకరం'.. అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ డ్రామాలు..బీఆర్ఎస్ నాటకాలు

అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు కాళేశ్వరం మీద డ్రామాలాడుతుంటే.. బీఆర్ఎస్ నేతలు క్రిష్ణా నీటి (Krishna River) నాటకాలాడుతున్నరని దుయ్యబట్టారు. అసెంబ్లీలో నిమిషానికి రూ.20వేలు ఖర్చవుతుందని.. ఈ లెక్కన సభ నిర్వహణ కోసం కోట్లు ఖర్చు చేస్తోందని.. కానీ ప్రజా సమస్యలను, వాళ్లకిచ్చిన హామీలను గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరి ముఖాలు ఒకరు టీవీల్లో కన్పించేందుకు పోటీలు పడి డ్రామాలాడుతున్నరని కౌంటర్లు వేశారు. ఒకరికొకరు తిట్టుకుంటరు తప్ప వాటిపై చర్యలుండవని.. ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోరని వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఆస్తులు పెరిగినయే తప్ప.. ప్రజల ఆస్తులు పెరిగినయా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు గుడిని మింగితే.. కాంగ్రెసోళ్లు గుడి లింగాన్ని కూడా మింగేస్తరని అన్నారు. కాళేశ్వరంపై అధికారంలోకి వస్తే సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ పని చేయడం లేదు? అని నిలదీశారు. సిట్టింగ్ జడ్డితో విచారణకు సీజే అంగీకరించలేదు కాబట్టి తక్షణమే సీబీఐ విచారణ కోరాలన్నారు.

#bandi-sanjay #ts-congress #brs #bandi-sajnay-kumar #congress #prajahita-yatra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి