MP Bandi Sanjay: తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు హెలికాప్టర్ లో కాళేశ్వరం వెళ్లొచ్చారని.. ఇంజనీరింగ్ నిపుణుల బృందం వెళ్లి విచారణ జరిపి నివేదిక కూడా ఇచ్చిందని.. కేంద్ర బృందం కూడా ప్రాజెక్టును సందర్శించి నివేదిక ఇచ్చిందని తెలిపారు. అయితే, మళ్లీ సీఎం సహా మంత్రులంతా వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, క్రిష్ణా నీటిపై నల్గొండలో సభ పేరుతో బీఆర్ఎస్ నాటకాలాడుతున్నయ్ అని విమర్శలు గుప్పించారు.విలువైన అసెంబ్లీ సమయాన్ని వ్రుధా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారంటూ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వ్రుధా చేసిన కేసీఆర్ (KCR) పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేశానని ముక్కు నేలకు రాసి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అట్లాగే ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ కోరాలన్నారు.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: కాళేశ్వరంపై కాంగ్రెస్ డ్రామాలు.. కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలు: బండి సంజయ్
సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా మళ్లీ కాళేశ్వరం వెళ్లాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, కృష్ణ నీటిపై బీఆర్ఎస్ నాటకాలాడుతున్నయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: