రైతు సంఘాల నేతలు మరోసారి ఢిల్లీలో తమ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.మార్చి 6న ఢిల్లీలో నిరసన చేయాలని.. అలాగే 10వ తేదీన దేశవ్యాప్తంగా రైల్రోకో చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
10th Class Hall Tickets : ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి హాల్టికెట్లు విడుదల కానున్నాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్ధులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా.. మార్చి 18 నుంచి 30 వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.
PM Modi : ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం) తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు ఆదిలాబాద్.. అలాగే రేపు సంగారెడ్డికి ప్రధాని వెళ్లనున్నారు. ఈ రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
Road Accident : వనపర్తి జిల్లా కొత్తపేట వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
Exercise : వ్యాయామం చేస్తే ఎవరికైనా మంచిదే. కానీ ఇది మగవారి కంటే ఆడవారికే ఎక్కువ మేలు చేస్తుందట. చూడటానికి ఇది ఆశ్యర్యంగా అనిపించినా ఇదే నిజం. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఇది బయటపడింది.
Israel-Hamas War: హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టేందుకు ఒప్పుకుంటే.. ఆరువారాల పాటు కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇటీవల తైవాన్ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్ వూ ఇంటర్వ్యూను భారత మీడియా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన చైనా భారత మీడియా ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తోందని.. తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ తమలో అంతర్భాగమేనని తెలిపింది.
9 Months Old Child Kidnapped : హైదరాబాద్లోని చంచల్గూడలో కిడ్నాప్ అయిన పాపను పోలీసులు రక్షించారు. ఆ చిన్నారి ఇంట్లో కేర్టేకర్గా చేరిన షాజహాన్ అనే మహిళ.. ఆ పాప తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎత్తుకెళ్లింది. ఎంజీబీఎస్లో జహీరాబాద్ బస్సు ఎక్కిన ఆమెను పోలీసులు పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.
విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన ఫొటోగ్రఫర్ సాయి విజయ్(23)ను షణ్ముఖ్ తేజ్(19) హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రూ.15 లక్షల విలువైన కెమెరాల కోసం ఈ హత్య జరిగినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న షణ్ముఖ్ను పోలీసులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
BRS Party : మాజీ సీఎం కేసీఆర్ఈరోజు మధ్యాహ్నం .. బీఆర్ఎస్ భవన్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ల పేర్లు ఖరారు చేయనున్నట్లు సమాచారం.
Advertisment
తాజా కథనాలు