జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు

మానవత్వం మంటగలుస్తోంది. చిన్న తనం నుంచి పెంచిన తండ్రిని కొడుకు చంపిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అంతే కాకుండా తండ్రి ఊరు వెళ్లాడని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
New Update

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల పరిధిలోని దుదేకులపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి చనిపోవడంతో కొడుకు ధనుంజయ్ తండ్రి తిరుపతి వద్దే పెరిగాడు. గత మూడు రోజుల క్రితం తండ్రీ కొడకుల మధ్య చిన్న గొడవ జరిగింది. అది చిలికి చిలికి గాలివానగా మారడంతో క్షణికావేశంతో ధనుంజయ్‌ కర్రతో తిరుపతి తలపై బలంగా మోదాడు. దీంతో తిరుపతి అక్కడి కక్కడే మృతి చెందాడు.

అనంతరం భయాందోళనకు గురైనా నిందితుడు విషయం బయటకు చెప్పుతే తనను పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో మృతదేహాన్ని మూటకట్టి మూడు రోజుల పాటు ఇంట్లోనే దాచాడు. ఇరుగు పోరుగు వారు అడిగితే తన తండ్రి ఊరుకి వెళ్లాడని నమ్మబలికాడు. కాగా ఇంట్లో దుర్వాసన రావడంతో ధనుంజయ్‌ తిరుపతి మృతదేహాన్ని మూటగట్టి తిసుకెళ్లి ఊరు చివర ఉన్న చెరువులో పడేశాడు. చెరువులో మృతదేహం ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్నా స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మృతుడి కొడుకు ధనుంజయ్‌పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు ధనుంజయ్‌ని రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.

#son #dhanunjay #dudekulapally #killed #father #jayashankar-bhupalapally-district #tirupati
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe