ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఈరోజు (సోమవారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాతా రేవంత్ను కలవడం ఇదే మొదటిసారి. ఆయనతో పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు షర్మిల తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలాఉండగా.. గతంలో తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..YS Sharmila: సీఎం రేవంత్ను కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల..
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల.. మొదటిసారిగా సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో కలిసి పలు రాజకీయ అంశాలు చర్చించినట్లు షర్మిల తన ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Translate this News: