/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/TDPJanasena-.jpg)
AP Elections 2024
ఏపీలో ఎన్నికల రోజు తమకు డబ్బులు అందలేదని అనేక చోట్ల ప్రజలు నాయకుల నివాసాల వద్ద ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికలు(AP Elections 2024) ముగిసిన తర్వాత సైతం ఈ తరహా ఆందోళనలు ఆగడం లేదు. డబ్బుల పంపకాల్లో సమన్యాయం చేయలేదంటూ సొంత పార్టీ నాయకులపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలవరం(Polavaram)లో జరిగిన ఈ వివాదం చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేన కార్యకర్తల అందోళన చేశారు. పోలింగ్ ముగిసినా డబ్బు పంపిణీ గోల తెగలేదు.
Read Also:మోదీ అబద్దాలకోరు: ఎంపీ జైరాం రమేష్
టీడీపీ, జనసేన మండల ప్రెసిడెంట్లు తమ చుట్టుపక్కల వారికే డబ్బులు పంచి మిగతా వారికి ఎగనామం పెట్టారని కార్యకర్తల ఆందోళన చేపట్టారు. పోలవరం జనసేన మండల ప్రెసిడెంట్ ఇంటి దగ్గర ఈ రోజు ఈ వివాదం జరిగింది. డబ్బులు పంచకపోవడంతో ఓటర్లు తమను నిలదీస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచే సీటును స్వలాభం కోసం పణంగా పెట్టారంటుటూ ఫైర్ అయ్యారు కార్యకర్తలు. దీంతో డబ్బులు పంపిణీ పంచాయితీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow Us