Telangana : దారుణం.. అంగన్వాడీ టీచర్ హత్య

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సుజాత అనే అంగన్వాడీ ఉపాధ్యాయురాలు హత్యకు గురైంది. తాడ్వాయి సమీపంలో కూలీపనుల కోసం అడవికి వెళ్లిన కొంతమందికి ఆమె మృతదేహాం కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Murder : ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఓ అంగన్వాడీ ఉపాధ్యాయురాలు(Anganwadi Teacher) హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాటాపురం అనే గ్రామంలో సుజాతం అనే మహిళ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె డ్యూటీ అయిపోయిన తర్వాత తన స్వగ్రామమైన ఏటురునాగారంకు బయలుదేరారు. అయితే బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో కూలీపనుల కోసం అడవికి వెళ్లిన కొంతమందికి సుజాత మృతదేహాం(Sujatha Dead Body) కనిపించింది. ఇది చూసి ఒక్కసారిగా షాకైన కూలీలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also read: ఆళ్లగడ్డలో హై టెన్షన్‌.. అఖిల ప్రియే టార్గెట్‌!

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి మెడకు స్కార్ఫ్ చుట్టి ఉరి వేసినట్లు గుర్తించారు. అలాగే సుజాతకు చెందిన నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్‌ చోరీకి గురైనట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇంట్లో విషాదం

Advertisment
తాజా కథనాలు