BIG BREAKING: వైసీపీ కీలక నేత మృతి.. జగన్ దిగ్భ్రాంతి!

ఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) ఈ రోజు మృతి చెందారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజాబాబు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.  సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు.

New Update
YS Jagan Condolence

ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్‌ పోతేపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) ఈ రోజు మృతి చెందారు. విషయం తెలుసుకుకున్న మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజాబాబు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.  సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. రాజబాబు మరణం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు