BIG BREAKING: ''వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు''

వైఎస్ జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ప్రధానిని కోరారు. జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చేలా భద్రతా వైఫలం కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

New Update
YS Jagan Life Threat

YS Jagan Security

వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే  విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోందని వైయస్సార్సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు భద్రత కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైయస్ జగన్ కు పోలీసులు రక్షణ కల్పించలేదని వివరించారు.
ఇది కూడా చదవండి: AP Liquor Scam: సజ్జలకు బిగ్ షాక్.. లిక్కర్ స్కామ్ లో బిగుస్తున్న ఉచ్చు?

MP Midhun Reddy Letter
MP Midhun Reddy Letter

 

జగన్ నివాసం వద్ద అనుమానాస్పద ఘటనలు..

దీంతో జగన్ పర్యటనలు తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తిందన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని అనుమానాస్పద ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఇవి భారీ ఎత్తున  పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలని వివరించారు. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోందని ధ్వజమెత్తారు. 
ఇది కూడా చదవండి: BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!

మాజీ సీఎం వైఎస్ జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఈ మేరకు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. జెడ్ ప్లస్ భద్రతను పూర్తిగా తొలగించారని గవర్నర్ కు వివరించారు. ఒక్క కానిస్టేబుల్ కూడా జగన్ పర్యటనలో కనిపించలేదన్నారు. జగన్ భద్రత విషయంలో తమకు ఆందోళనగా ఉందన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు