AP Liquor Scam: సజ్జలకు బిగ్ షాక్.. లిక్కర్ స్కామ్ లో బిగుస్తున్న ఉచ్చు?

ఏపీ లిక్కర్ స్కామ్ లో అధికారులు దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ 6న సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు పంపించారు. అయితే వారు ఇప్పటి వరకు స్పందించకపోవడంపై చర్చ సాగుతోంది.

New Update

ఏపీ లిక్కర్ స్కామ్‌కు సంబంధంచి సిట్ దూకుడు పెంచింది. ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన స్కామ్‌ను బయటకు తీస్తున్నారు సిట్ అధికారులు. ఈ క్రమంలో వైసీపీ కీలక నేత, గత ప్రభుత్వ హాయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి బంధువుకు నోటీసులు పంపించింది. గతేడాది అక్టోబర్ 6న సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు పంపించారు. టెక్నికల్ ఎర్రర్ కింద 7,39,73,739 రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 6 నెలలు గడుస్తున్నా నోటీసులకు స్పందన రాలేదని తెలుస్తోంద. ఎక్సైజ్ శాఖలో సాఫ్ట్‌వేర్ కోసం ఢిల్లీకి చెందిన TCIL కంపెనీతో ఆగస్టు 27, 2021న ఎక్సైజ్ శాఖ ఒప్పందం కుదుర్చుకుంద. TCIL ద్వారా విశిష్ట కంపెనీ సబ్ కాంట్రాక్ట్ పొందింది. ఒప్పందాన్ని ఆడిటర్ రిపోర్ట్ తప్పుబట్టింది. అయితే.. ఎక్సైజ్ శాఖలో సజ్జలకు కొందరు సహకరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
ఇది కూడా చదవండి: Kiran Royal-laxmi: బలవంతంగా కామదాహం తీర్చుకున్నాడు.. ఆ నీచుడిని అరెస్టు చేయండి!

ఢిల్లీని తలదన్నే స్కామ్..?

ఇదిలా ఉంటే.. ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీని తలదన్నేలా ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.16వేలకోట్ల అవినీతి జరిగినట్లు ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆడిట్ నివేదిక ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్లు సమాచారం. ఈ సంచలన నివేదిక RTV చేతికి చేరింది. ఈ ఆడిట్‌ రిపోర్టును పరిశీలిస్తే అనేక సంచలన విషయాలు ఉన్నాయి. I&PR అనుమతి లేకుండా అప్పటి సీఎం బర్త్‌డే కోసం రూ.3.15 కోట్ల ప్రకటనలను ఎక్సైజ్ శాఖ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. CCTV కొనుగోలు కోసం ఎక్సైజ్‌శాఖ నిధుల నుంచి రూ.71లక్షలు చెల్లింపులు చేశారు.
ఇది కూడా చదవండి: Viral News: అసలు ఈ దేవిక ఎవరు? సోషల్ మీడియాలో TDP, YCP ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్.. అక్యూట్  రేటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీలకు ఇష్టారాజ్యంగా రూ.5కోట్లు చెల్లింపులు చేశారంటూ ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా NCDS రూపంలో రూ.8305 కోట్ల చెల్లింపులు జరిగినట్లు తేల్చారు. 2022-23లో రూ.1500 కోట్లు రుణాలను ఇతర పనులకు మళ్లింపులు చేసినట్లు నివేదికలు పేర్కొన్నారు. ఎక్సైజ్‌ శాఖలో నిధుల మళ్లింపు స్కామ్ లో రమేష్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, కరీముల్లా, OSD వేణుగోపాల్, నాగేశ్వరరావు, ES.శౌరి, సీఐ రమేష్, DGM చరణ్, BC సత్యప్రసాద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు