AP Elections 2024: వైసీపీలోకి టీడీపీ కీలక నేత
ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీలో చేరారు అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనకు వైసీపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
ఎన్నికల వేళ టీడీపీకి షాక్ తగిలింది. వైసీపీలో చేరారు అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనకు వైసీపీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బిడ్డ సాయి మేఘన(18) ఫిట్స్ తో మృతి చెందింది. కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఉషారాణి సైతం గుండెపోటుతో మృతి చెందింది. ఈ హృదయ విదారకరమైన ఘటన స్థానికులను కలచివేస్తోంది.
ఏపీలో అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయమని సీఎం జగన్ అడుగుతుంటే.. పొత్తులు చూసి ఓటేయ్యాలని విపక్షాలు కోరుతున్నాయని గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇలాంటి కూటములు ఎన్ని వచ్చినా జగన్ను టచ్ చేయలేరన్నారు. పాపం పవన్ కళ్యాణ్ను అమాయకుణ్ని చేసి.. సీట్లు తగ్గించేశారంటూ ఎద్దేవా చేశారు.
నటి ఐశ్వర్య ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఐశ్వర్య ఫోన్ కాల్స్ లైవ్ లో వినిపించాడు భర్త శ్యామ్ కుమార్. భర్త మంచివాడు కాదని శాడిస్ట్ అంటూ ఐశ్వర్య మాట్లాడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఐశ్వర్య మందు, సిగరెట్లు తాగేదని వివాహేతర సంబంధం ఉందని భర్త ఆరోపిస్తున్నారు.
విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్- విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి.ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
టీవీ నటులు, సినిమా వాళ్ళు మోసాలు చేయడం ఈ మధ్య తురుచూ వింటున్నాం. ఇప్పుడు తాజాగా విశాఖలో ఇలాంటి మోసం మరొకటి బయటపడింది. నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్ళి చేసుకుని మోసం చేసిందని...ఆమె భర్తే స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య ఇప్పటికే ఒక వందే బారత్ రైలు నడుస్తోంది. ఇప్పుడు మరో ట్రైన్ను ప్రారఃబించబోతున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి వందే బారత్ రైలును ప్రారంభించనున్నారు.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్ధులకు హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెస్తోంది. మొత్తం 81 పోస్టులకు ఈ నెల 17న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1.48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
రెండోసారి అధికారం సాధించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టుసాధిస్తే మెజారిటీ వచ్చినట్టేనని భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు.