/rtv/media/media_files/2025/06/15/7xuk93e2JC8bLiCr15Dn.jpg)
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి రీసు సూరి అనే వ్యక్తి ఇంటి మట్టిగోడ కూలిపోయింది. ఆదివారం ఆ గోడ మట్టిని తీస్తుండగా పక్కనున్న మరో ఇంటిగోడ కూలీ పోయింది.
గోడ కూలీలపై పడి ఇద్దరు మృతి చెందారు. మట్టి తవ్వుతున్న ఇద్దరు కొలుసు పైడితల్లి (45) , ఎర్ర చిన్నయ్య పైడితల్లి (61) లపై పక్కింటి గోడ కూలీ పడిపోయింది. వారు అక్కడికక్కడ మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేశారు.