Andhra Pradesh: ఏపీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. ఇద్దరు లెక్చరర్లు అరెస్టు

ఏపీలోని తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా డీఎస్పీ భక్తవత్సవం ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
S*xual Assault case against student in Tirupati, Two professors arrested

S*xual Assault case against student in Tirupati, Two professors arrested

ఏపీలోని తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు లెక్చరర్లను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా డీఎస్పీ భక్తవత్సవం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే తిరుపతి జాతీయ సంస్కృతి యూనివర్సిటీలో ఒడిశాకు చెందిన యువతి (27) బీఈడీ ఫస్ట్ ఇయర్ చదవుతోంది.  వర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.లక్ష్మణ్‌ కుమార్‌.. ఆ విద్యార్థిని ప్రలోభపెట్టాడు. తన ఆఫీసు గదిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

Also Read: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్రానికి రూ.5.75 లక్షల కోట్లు పెట్టుబడులు

అదే డిపార్ట్‌మెంట్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డా.ఎ.శేఖర్‌రెడ్డి ఆ ఆఫీసు కిటీకి బయట నుంచి ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెడతామంటూ ఆ విద్యార్థిని వేధించారు. చివరికి ఆ విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో డా.లక్ష్మణ్‌ కుమార్‌ను వారు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఈ కేసులో నిందితులైన లక్ష్మణ్‌కుమార్, శేఖర్‌రెడ్డిలను అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

Also Read: తెలంగాణలో సల్మాన్ ఖాన్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి.. ఎక్కడ, ఏ రంగంలో అంటే?

Advertisment
తాజా కథనాలు