AP: ముఖ్యమంత్రి చంద్రబాబు- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ మధ్య ఆసక్తికర చర్చ ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును నీతి ఆయోగ్ ఛైర్మన్ సుమన్ బెరితో పాటూ మొత్తం బృందం సమావేశమయ్యింది. ఏపీ అభివృద్ధి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం. దాంతో పాటూ ఇద్దరూ పాత విషయాలను తలుచుకుని కాసేపు ముచ్చటించుకున్నారు. 

New Update
AP

Neethi Ayog Chairman Suman Beri, AP CM Chandra babu

స్వర్ణాంధ్ర 2047 సాధనకు తోడ్పాటు అందివ్వాలని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బేరిని  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు.  ఏపీ లో ఏఐకు సంబంధించి అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు… ఏపీ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం అని.. నీతి ఆయోగ్ సహకారం కూడా అవసరం అన్నారు. ఏపీకి వచ్చిన నీతి ఆయోగ్ బృందంతో సీఎం చంద్రబాబు ఈరోజు సమావేశమయ్యారు.  ఏపీ విజన్ 2047 సహా ఏపీ ఆర్థిక పరిస్థితి, అమరావతి నిర్మాణం నీతి ఆయోగ్ బృందానికి, సీఎం చంద్రబాబు మధ్య చర్చలు సాగాయి. 

పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సుమన్ బెరి

సమావేశం అనంతరం సుమన్ బెరి, చంద్రబాబు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. చంద్రబాబు తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుమన్ బెరి పాత జ్ఞాపకాలను తలుచుకున్నారు. 30 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును కలిసిన సంగతులు గుర్తు చేసుకున్నారు. అప్పటి గవర్నర్ రంగరాజన్ తో కలిసి నాడు హైదరాబాద్ లో చంద్రబాబును కలిసిన అంశాలను  సమన్ బేరీ సీఎంకు గుర్తు చేశారు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నా....సంస్కరణలు అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మేలు చేసిన నాయకుడు మీరే అంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్  చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. వాజ్ పేయి హయాంలో నాటి సంస్కరణలను అందిపుచ్చుకుని తీసుకువచ్చిన పాలసీలు ప్రజల జీవితాలు మార్చాయని  సుమన్ బేరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ప్రతి పాలసీ, ప్రతి సంస్కరణ తరువాత కాలంలో దేశం పాటించిందని చెప్పారు.

ఐటీ కి ప్రోత్సాహంతో పాటు ఎయిర్ పోర్టులు, ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లు, పిపిపి పద్దతిలో రోడ్లు వంటి అనేక ఆవిష్కరణలకు మీరు నాంది పలికారు అంటూ చంద్రబాబును సుమన్ బెరీ కొనియాడారు. మీలా భవిష్యత్ అవసరాలను గుర్తించి ఆలోచనలు, పాలసీలు అమలు చేసే నాయకులతో ప్రజల జీవితాలు మారుతాయని ఆయన అన్నారు. ఇప్పుడు ఇండియా టైం వచ్చింది....ఈ సమయాన్ని దేశం 100 శాతం సద్వినియోగం చేసుకోవాలన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ శక్తిగా ఎదగడానికి ఇప్పుడు వేగంగా అడుగులు వేయకపోతే.....ఇక ఎప్పుడూ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు సుమన్ బేరీ.మోదీ నాయకత్వంలో అన్ని అవకాశాలను అందుకుని దేశం ముందడుగు వేస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మీటింగ్ అనంతరం వాహనం వద్దకు వెళ్లి మరీ సుమన్ బెరీకి సిఎం చంద్రబాబు వీడ్కోలు పలికారు. 

Also Read: Delhi: ఢిల్లీలో డ్రామా..ఆప్ అధినేత కేజ్రీవాల్ కు ఏసీబీ నోటీసులు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు