Mudragada Padmanabha: ‘నా ఆరోగ్య పరిస్థితి ఇదే’.. ముద్రగడ సంచలన లేఖ

మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన ప్రస్తుత ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానన్నారు.

New Update
Mudragada Padmanabham reddy Releases Letter

Mudragada Padmanabham reddy Releases Letter

మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి తాజాగా సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఆయన తన కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పలు అంశాలను రాసుకొచ్చారు. ఈ మేరకు ఆయన రిలీజ్ చేసిన లేఖలో పేర్కొన్న అంశాల విషయానికొస్తే.. ఈ మధ్య తమ కుటుంబంపై మరొక కుటుంబం దాడి చేస్తున్న సంగతి అందరికీ తెలుసు అని అన్నారు. అయితే ఆ కుటుంబానికి, తమకు చాలా ఏళ్ల క్రితమే మనస్పర్థాలు వచ్చాయని అన్నారు. 

Also Read: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ - 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్‌ తక్కువకే!

ముద్రగడ సంచలన లేఖ

దీంతో ఒక ఏడాది నుండి తమకు వారికి పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయని.. వారి జోలికి తాను వెళ్ళడం లేదని తెలిపారు. అయినా వారు తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని ఆ లేఖలో రాసుకొచ్చారు. అయితే దీనికీ ఓ కారణం ఉందని తెలిపారు. తమ చిన్న కొడుకు గిరిబాబు ఎదుగుదల చూడలేకే అసూయపడి రగలిపోతున్నారని అన్నారు.

తనకు కాన్సర్ వచ్చిందని.. ఇంట్లో బందించి చిన్న కొడుకు, వారి మామ పట్టించుకోవడం లేదని ఎవేవో మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. కానీ ఇవాళ ట్రీట్మెంట్ చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి తన చిన్నకొడుకు గిరిబాబే 100 శాతం కారణమని రాసుకొచ్చారు.

Also Read: ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

అయితే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వేరే ఉద్దేశ్యం ఉందని ఆయన అన్నారు. తన అబ్బాయిని దూరం చేస్తే వారింటికి చేరతానని.. వారి అడుగులకు మడుగులోత్తుతానని అనుకుంటున్నారేమో? అని అన్నారు. అది ఈ జన్మకు జరగని పని.. ఈ జన్మకే కాదు.. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ ఇంటికి వెళ్ళడం జరగదు అని రాసుకొచ్చారు. 

Also Read: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

గతంలో కూడా తన భార్యకు అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత 15 రోజులు గడిచాక డిశ్చార్జ్  అయ్యి విశ్రాంతి కోసం వారి ఇంటికి వెళితే ఇంటి నుండి బయటికి పంపిన సంగతి మరిచిపోయారా? అని ప్రశ్నించారు. తనకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు తప్ప మరే సమస్యలు లేవన్నారు. 

నిత్యం తన ఇంటికి వచ్చిన అభిమాన ప్రజలందరితోనూ కలుస్తున్నానన్నారు. తనను బంధించి ఉంచడం కాని.. మానసికంగా వేధించడం కానీ ఎవరీ తరమూ కాదని పేర్కొన్నారు. మీకు దమ్ముంటే కాపు రిజర్వేషన్, ఎన్నికలలో ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ స్కీమ్‌లను అమలు చేయించిన తర్వాత మీ డబ్బా కొట్టుకోండి అని అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు