వివేకా హత్యకేసులో నాస్టేట్ మెంట్ మార్చేశారు..మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం.!
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వ్యవహరించిన తీరుపై మాజీ ఐఏఎస్ అజయ్ కల్లాం హైకోర్టును ఆశ్రయించారు. తన వాగ్మూలానికి ఏ మాత్రం పొంతన లేని సమాచారాన్ని సీబీఐ ఛార్జ్ షీట్ తయారు చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలపై లోతైన విచారణ జరగాలనే ఉద్దేశంతో హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు.వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని అజయ్ కల్లాం గతంలో చెప్పారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ తన నుంచి కొన్ని వివరాలు తీసుకుందని.. తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన 161 స్టేట్ మెంట్కు ఎలాంటి విలువ లేదన్నారు.కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందన్నారు. జగన్ సతీమణి ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని..తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయన్నారు.