/rtv/media/media_files/2025/05/30/0wUOyjxuXpCKaD7ZOfGV.jpg)
AP Journalist Accreditation
AP Journalist Accreditation:
ఏపీ జర్నలిస్టుల అక్రిడేషన్ను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ చేసేంతవరకు లేదా ఆగస్టు31 వరకు ఏది ముందైతే అప్పటివరకు పొడిగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
Also Read: Shock To Trump: ట్రంప్ టారీఫ్ లకు యూఎస్ ఫెడరల్ కోర్ట్ బ్రేక్..
జర్నలిస్టులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జారీ చేయాల్సిన అక్రిడేషన్ ను మరోసారి పొడిగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి అక్రిడేషన్ ముగిసి ఏడాది గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారటం, గతంలో ఇబ్బడిముబ్బడిగా జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీచేశారనే ఆరోపణల నేపథ్యంలో(Journalist Accreditation Extension) అక్రిడేషన్ను పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఇది మూడోసారి. కాగా తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో మీడియా అకాడమీ చైర్మన్గా సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే(Media Accreditation News) అక్రిడేషన్ కార్డుల జారీలో నూతన మార్గదర్శకాలను ప్రవేశపెట్టే ఉద్దేశంతో అక్రిడేషన్ల జారీని పొడిగిస్తూ వస్తున్నారు. కాగా తెలంగాణలోనూ పొడిగించిన అక్రిడేషన్ జూన్ 30తో ముగియనుంది. అప్పటికైనా కొత్త అక్రిడేషన్లు జారీ చేస్తారా? మరోసారి పొడిగిస్తారా? అనే అంశంలో క్లారిటీలేదు.
Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్కి శిక్ష ఏంటో తెలుసా?
ఏపీలో ఈ నెల 31తో గడువు ముగియ నుండటంతో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ సమయం లేదా ఆగస్టు 31, ఏది ముందైతే అప్పటి వరకు పొడిగింపు వర్తిస్తుందని డైరెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.. రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల(Telangana Press ID Card) గడువు ఈ నెలతో ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాల పరిమితిని మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పొడిగింపు జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యే వరకు ఉంటుందని, ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు హిమాన్షు శుక్ల తెలిపారు.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్