AP Crime: స్నేహితులే కాలయముళ్లు...బండరాయితో మోది...

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. కాసులు అనే యువకున్ని అతని స్నేహితులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో మృతదేహం కుళ్లిన స్థితిలో లభించింది.

New Update
 Murder case

Murder case

AP Crime: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామ శివారులో దారుణం చోటు చేసుకుంది. కాసులు అనే యువకున్ని అతని స్నేహితులే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో మృతదేహం కుళ్లిన స్థితిలో లభించింది. మృతుడు వెంకట నగరం గ్రామానికి చెందిన చిన్నబ్బులు (కాసులు ) గా పోలీసులు గుర్తించారు. ఇటీవల తన స్నేహితులతో కలిసి వెళ్లిన కాసులు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV News App Download Links: 

ఆండ్రాయిడ్(Android) వినియోగదారులు: https://t.co/B1FaPB6Zsr

IOS వినియోగదారులు: https://t.co/4nRQaLbtfv

 

Also Read: ట్రంప్ తో గొడవ..టెస్లా షేర్లు ఢమాల్..రూ.13 లక్షల కోట్లు ఆవిరి

కాగా కాసులు (చిన్నబ్బులు)  తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మద్యం సేవించే సమయంలో వారి మధ్య విభేదాలు వచ్చాయి.  దీంతో వారితో కాసులు ఘర్షణ పడ్డాడు. వారిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఏప్పటికైనా వాడితో ప్రమాదం ఉంటుందని భావించిన స్నేహితులు హత్యకు పాల్పడినట్లు  పోలీసుల ప్రాథమిక దర్యాప్తు లో తేలింది. గ్రామశివారులోని నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లిన వారు బండ రాయితో మోది చంపేసినట్లు తెలుస్తోంది. అయితే అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరికింది. కాగా ఈ ఘటనలో అనుమానం ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో తల్లి కొడుకు మృతి వెనుక ఉన్న ఘోర నిజాలు

Also Read: బెంగళూరు ఘటనపై ప్రభుత్వం దూకుడు...కొనసాగుతున్న అరెస్టుల పర్వం

RTV LIVE Telugu News App
Advertisment
Advertisment
తాజా కథనాలు