Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గాయోచ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు సంక్రాంతి పండగ వేళ మద్యం కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పింది. మద్యం ధరలను తగ్గించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 16 రకాల బ్రాండ్ల మద్యం దొరుకుతుండగా.. ఇప్పటికే 10 బ్రాండ్ల ధరలను తగ్గించారు.

New Update
liquor

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం పాలసీని పూర్తిగా మార్చేసి.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నాణ్యమైన బ్రాండ్ల మద్యం దొరకడంతోపాటు ధరలు కూడా కొంచెం తగ్గడంతో మందుబాబులు సంతోషంగా ఉన్నారు. ఇక గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నడవగా.. ప్రస్తుతం మాత్రం ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు ఇవ్వడం జరిగింది.

Also Read: Kamala Jobs: స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చిన భార్య..కుదుటపడిన ఆమె ఆరోగ్యం

అంతేకాకుండా కొత్త బ్రాండ్లను తొలిగించి.. అంతకుముందు ఉన్న బ్రాండ్లను మళ్లీ తీసుకొచ్చారు. అంతేకాకుండా 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్.. ఆ తర్వాత దాన్ని అమలు చేసింది. ఈ రూ.99 క్వార్టర్‌కు మందుబాబుల నుంచి మంచి గిరాకీ ఉన్నట్లు మద్యం షాపు వర్గాలు అంటున్నాయి.

అయితే తాజాగా సంక్రాంతి పండగ వేళ.. మందుబాబులకు మద్యం కంపెనీలు మరో భారీ శుభవార్తను మోసుకొచ్చాయి. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా.. వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించిన విషయం తెలిసిందే. మరో 6 కంపెనీలు కూడా తాజాగా ధరలు తగ్గించాయి. మరోవైపు.. మద్యం ధరలను తగ్గించి.. విక్రయాలను మరింత పెంచుకోవాలని మద్యం కంపెనీలు అనుకుంటున్నాయి.

Also Read: Zucker Berg: మెటాలో భారీగా ఉద్యోగ కోతలు...ప్రకటించిన జుకర్‌ బర్గ్‌!

ఇక ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్ మద్యం ధరలను తగ్గించటంతో ఇతర కంపెనీల పైనా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ కంపెనీలు కూడా ధరల తగ్గింపునకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మార్కెట్‌లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల మద్యం అమ్మకాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరిపినా.. బెల్టు షాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేసింది. 

ఫలితంగా మద్యం విక్రయాలపై అధికారుల నిఘా పెరిగింది. లిక్కర్‌ బ్రాండ్లలో క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.80 వరకు ధరలు తగ్గుతున్నట్లు అధికారులు ప్రకటించారు. మాన్షన్‌ హౌస్‌ కంపెనీ.. ఒక్కో క్వార్టర్‌పై రూ.30 తగ్గించింది. అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా రూ.50 మేర తగ్గింది. కింగ్‌ఫిషర్‌ బీరు రూ.10 వరకు తగ్గింది.

బ్యాగ్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ ఒకేసారి రూ.80 తగ్గించుకునేందుకు వీలుగా దరఖాస్తు చేసింది. అయితే.. ఇలా కంపెనీలు ధరలు తగ్గించడం మాత్రం ప్రభుత్వానికి కొంత ఎదురుదెబ్బగా మారింది. ధరల తగ్గింపు వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గుతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే మందుబాబులకు మాత్రం ధరల తగ్గింపు అనేది కిక్ ఇచ్చే వార్త అని పేర్కొంటున్నారు.

Also Read: ఆన్‌లైన్ లవర్ కోసం ఆశపడి భర్తకు విడాకులు.. తీరా చూస్తే అది AI స్కామ్

Also Read: Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు