/rtv/media/media_files/2024/12/19/zNPcScId5tsj28KaWHht.jpg)
Suspicious deaths in srikakulam
Suspicious deaths : విజయనగరం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు శ్రీకాకుళం జిల్లాలోని ఒక బావిలో శవాలై తేలారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయంశంగా మారింది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన వరలక్ష్మి (కూతురు), సరస్వతి (తల్లి) ఇద్దరూ శ్రీకాకుళం జిల్లా రాగోలు మండలం గూడెం గ్రామం వద్ద బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.
Also read : Subham Trailer పెళ్ళాల సీరియల్ పిచ్చికి బలైన మొగుళ్ళు.. సామ్ స్పెషల్ ఎంట్రీ అదుర్స్! ట్రైలర్ చూశారా
ఈ నెల 24 వ తేదీన విశాఖ జ్ఞానాపురం చెర్చిలో వరలక్ష్మి కుమార్తె చంద్రిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు ఉండడంతో ఆ బాలిక మృతి కలకలం రేపింది. అంతకు ముందు ఆ బాలికకు గాలి సోకిందని చర్చికి తీసుకువెళితే నయమవుతుందని ఆమె తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఏమైందనేది తెలియదు కానీ ఆ బాలిక మరణించింది. అయితే, తనకు తెలియకుండా తన కూతురును చర్చికి తీసుకెళ్లారని బాలిక తండ్రి నిన్నటి రోజున ఆరోపించాడు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు పోలీసులు బాలిక తల్లి, అమ్మమ్మను అదుపులోకి తీసుకుని విచారణ చేసి వదిలేశారు.
Also Read: CSK : పెద్ద ప్లేయర్స్ ఆడటం లేదు..నేనేం చేయాలి..ధోని
అయితే కుమార్తె మృతిపై విశాఖ పోలీసులకు వరలక్ష్మినే ఫిర్యాదు చెసినట్లు మరికొంతమంది చెబుతున్నారు. ఈ క్రమంలో గూడాంలో మృతుల దూరపు బంధువు ఇంటికి వచ్చే క్రమంలో వీరిని హతమార్చి బావిలో పడేశారని ప్రచారం సాగుతోంది. మరోవైపు తమ కూతురు మరణానికి తనతో పాటు తన తల్లి కారణమని పోలీసులు అనుమానించడంతో పాటు మరోసారి విచారణకు పిలుస్తారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అయితే వారు పోలీసుల కేసుకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెవరైనా చంపారా అనేది మిస్టరీగా మారింది. అయితే బాలిక మృతికి కారణాలు తెలిస్తే వీరిద్ధరి మరణానికి కారణాలు బయటపడుతాయని స్థానికులు అంటున్నారు.
Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం
కాగా వీరిద్దరినీ ఎవరో హతమార్చి నేలబావిలో పడేసారని అనుమానిస్తున్న పోలీసులు కి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. విచారణ చేపట్టిన పోలీసులు అన్ని కోణాల్లో మిస్టరీన ఛేదించే పనిలో పడ్డారు. కాగా బావిలో తల్లీ్కూతుళ్ల మృతదేహాలు లభ్యం కావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు.
Also Read : Chhattisgarh : స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!