ఏపీలో ఫ్రీబస్ స్కీమ్ అమలు డేట్ ఇదే.. మహిళలకు మంత్రి శుభవార్త!

ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు.

New Update
AP Free Bus Scheme

ఏపీలో మహిళలకు ఫ్రీబస్ స్కీమ్ పై మంత్రి రవాణ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ అమల్లోకి రానుందని చెప్పారు. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాలోని శ్రీసిటీని అభివృద్ధి చేస్తామన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రాష్ట్ర అభివృద్ధి దిశగా అనేక మార్పులు తెచ్చామన్నారు. మహిళలకు 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. మొత్తం 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మరో 2 నెలల్లో ఫ్రీబస్ స్కీమ్ ను సైతం ప్రారంభించనున్నట్లు చెప్పారు మంత్రి. 

రేపటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం..

రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కూటమి ప్రధాన ఎన్నికల హామీ అయిన సుపర్ సిక్స్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఫ్రీబస్ స్కీమ్ అమలుకు సంబంధించి సైతం ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు