తన మీద దాడి చేయడానికి బీజేపీ నేతలు కర్రలు, రాడ్లు పట్టుకుని వచ్చారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలీసులు ఉదయం నుండి తనను ఆపుతున్నారని ఫైర్ అయ్యారు. కానీ బిజెపి వాళ్లను మాత్రం ఆపలేకపోయారన్నారు. ఆర్టీవీతో షర్మిల ప్రత్యేకంగా మాట్లాడారు. ఓ పార్టీ అధ్యక్షురాలికే రక్షణ లేకుండా పోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేపు నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలన్నా ఇలాంటి దాడులు జరుగుతాయని భయపడాలా.. అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు క్షమాపణ చెప్పాల్సిందే..
— RTV (@RTVnewsnetwork) April 30, 2025
ఇది నా మీద జరిగిన దాడి..నా మీద దాడి చేయడానికి బిజెపి వాళ్లు వచ్చారు..
అందుకే కర్రలు రాళ్లతో దాడి చేయబోయారు..
ఓ పార్టీ అధ్యక్షురాలికే రక్షణ లేకుండా పోతే.. సామాన్యుల పరిస్థితి ఏంటి..
రేపు నేను ఇంటి నుండి బయటకు వెళ్లాలన్నా ఇలాంటి దాడులు… pic.twitter.com/Sox0UwF9C9
బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
తన మీద జరిగిన దాడికి బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలన్నారు. 2015లో నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంను సందర్శించాలని షర్మిల ఆ రోజు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ అంశంపై RTVకి షర్మిల ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
(sharmila | ap-chief-sharmila | telugu-news | telugu breaking news)