/rtv/media/media_files/2025/02/24/XXqduGDJjGcnZXYAfOff.jpg)
Pawan Kalyan On YS Jagan
Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా చంద్రబాబో లేక తానో ఇచ్చిది కాదని డిప్యూటీ సీఎం పవన్ సెటైర్లు వేశారు. ప్రజలే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడుతూ.. వైసీపీకి 11 సీట్లు వస్తే జనసేనకు 21 వచ్చాయన్నారు. అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అని అన్నారు. ఓట్లు ఎక్కువ శాతం వస్తే వాళ్ళకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం జర్మనీలో ఉంటుందన్నారు. అలా కావాలంటే వైసీపీ జర్మనీకి వెళ్ళవచ్చన్నారు. గవర్నర్ నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ రోజు అసెంబ్లీ ని ఉద్దేశించి ప్రసంగించారన్నారు. వైసీపీ నాయకులు హుందాగా ప్రవర్తించాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రజలు మీకు పదకొండు సీట్లిచ్చారు... మీ స్థాయికి తగ్గట్టుగా మీరు నడుచుకుంటే మంచిది - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 🔥🔥@ysjaganpic.twitter.com/kEU66YA9RH
— Viswanadh (@kuruba_visu) February 24, 2025