మార్కాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామన్నారు. తప్పకుండా మార్కాపూరంను జిల్లా కేంద్రం చేస్తామని స్పష్టం చేశారు. తద్వారా ఈ ప్రాంతంలోని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. చంద్రబాబు ప్రకటనతో మార్కాపురం ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మార్కాపురంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. స్వయంకృషితో ఎదిగిన మహిళలను ముఖ్యమంత్రి అభినందించారు.
మార్కాపురంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన సీఎం చంద్రబాబు గారికి అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. స్వయంకృషితో ఎదిగిన మహిళలను ముఖ్యమంత్రి… pic.twitter.com/W971qMxn20
— Telugu Desam Party (@JaiTDP) March 8, 2025