Ap Home Minister: ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఆమె పై విశాఖ ఏడో ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలుచేసిన చెక్ బౌన్స్ కేసును హైకోర్టు కొట్టేసింది. మంగళవారం విచారణ జరగ్గా.. హోంమంత్రి అనిత, ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అంటెడ్ అయ్యారు. ఇద్దరితో న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మాట్లాడారు. ఈ కేసును రాజీ ద్వారా పరిష్కరించుకుంటున్నారా.. కింద కోర్టులో కేసును కొట్టేయొచ్చా అంటూ వారిని ప్రశ్నించారు. Also Read: Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఈ కేసును తాము రాజీ చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టులో విచారణ సమయంలో హోంమంత్రి తరఫు లాయర్ రాజీ అంశాలను ప్రకటించారు. ఓ మెమోను దాఖలు చేశామని తెలిపారు. ఇప్పటికే రూ.10 లక్షలు శ్రీనివాసరావుకు అందజేశామని.. మరో రూ.5 లక్షలను చెక్కు రూపంలో శ్రీనివాసరావు తరఫు లాయర్కు హైకోర్టులో అందజేశారు. మొత్తానికి ఈ కేసు కొట్టివేయడంతో హోమంత్రి అనితకు భారీ ఊరట లభించినట్లయ్యింది. ఎప్పటి నుంచో ఇబ్బందిగా మారిన ఆ కేసు నుంచి విముక్తి లభిస్తుంది. Also Read: Ap: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్...క్రిస్మస్,సంక్రాంతి కానుకలు! 2015లో అనిత తన దగ్గర నుంచి తీసుకున్న రూ.70లక్షల అప్పు చెల్లించేందుకు.. 2018లో అనిత చెక్కు ఇచ్చారని, అది చెల్లలేదని వేగి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన 2019లో విశాఖపట్నం ఏడో ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ అంశంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో తమ మధ్య రాజీ కుదిరిందని పిటిషన్దారు చెప్పారు. విశాఖ కోర్టులో కేసును కొట్టేయాలని హోంమంత్రి అనిత హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈ మేరకు తాజాగా తీర్పును ప్రకటించారు. Also Read: 11 లక్షల 70 వేలమంది బడి మానేశారు..ఎక్కువగా ఎక్కడ అంటే? ఈ పిటిషన్పై ఈనెల 3న కూడా విచారణ అయ్యింది. అయితే హైకోర్టు ఇరువురు ఏ విధంగా రాజీ కుదుర్చుకున్నారో చెప్పకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. అనితపై తప్పుడు కేసు పెట్టారంటూ అభియోగాలు రాగా.. తాను తప్పుడు కేసు పెట్టలేదని శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. తాను డబ్బుల కోసం తిరగలేకే రాజీ చేసుకున్నట్లు ఆయన వివరించారు. Also Read: ఇజ్రాయెల్ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు ఈ మేరకు హోంమంత్రి అనిత తరఫు లాయర్ రాజీ విషయాన్ని కోర్టుకు చెప్పారు. అయితే రాజీకి సంబంధించిన వివరాలను సమర్పించాలని కోర్టు చెప్పింది. దీంతో మంగళవారం విచారణ జరగ్గా.. విశాఖ కోర్టులోని కేసును కొట్టి వేస్తున్నట్లు తీర్పునిచ్చారు.