/rtv/media/media_files/2025/06/10/EYIIDnTA8oRr40EQeSiT.jpg)
andhra pradesh heat wave alert
Heat Wave Alert: ఏపీ(AP)లో నేడు ఎండలు మండిపోనున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని అధిక స్థాయిలో చూపించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ(Andhra Pradesh Disaster Management Authority) హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు(Rains) దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
Also Read: లాస్ఏంజెల్స్లో ఆందోళనలు.. రిపోర్టర్ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)
ఉదయం పూట ఎండలు భగభగ మండిపోగా.. సాయంత్రం వేళలో నల్లటి మబ్బులు కమ్మి వర్షాలు పడుతుండటం చూశాం. అయితే ఇవాళ మాత్రం భానుడి విశ్వరూపం తప్పదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని దాదాపు 15 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వెల్లడించింది.
Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్
ఈ జిల్లాల్లో ఎండలు
ఏఏ జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయో కూడా తెలిపింది. ఇవాళ విజయనగరం, అల్లూరి, మన్యం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు వంటి జిల్లాల్లో ఇవాళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
గరిష్టంగా 41- 42.5°C వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరుసటి రోజు అంటే బుధవారం (జూన్ 11) గరిష్టంగా 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. అయితే ఇలా ఎండలు మాత్రమే కాకుండా ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read : మునగ నీటితో అద్భుత లాభాలు.. డయాబెటిక్ రోగులకు బెస్ట్ కషాయం..!!