అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తుది విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఐడీ కీలక వాదనలు వినిపించింది. కేవలం అమరావతిలో ఉన్న ఎస్సీల భూములను మాత్రమే నారాయణ బినామీల పేరుతో కొనుగోలు చేయించారని పేర్కొంది సీఐడీ. ఎస్సీల నుంచి భూములు కొని వారే హక్కుదారులుగా చూపించాలనే కుట్రతో జీవో 41 తీసుకొచ్చారని వెల్లడించింది. వీటికి రక్షణ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం లేకుండానే జీవో 41 తీసుకువచ్చారని కోర్టులో సీఐడీ వాదనలు వినిపించింది.
పూర్తిగా చదవండి..అమరావతి అసైన్డ్ భూముల కేసు: సీఐడీ కీలక వాదనలు
బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో రూ.18 కోట్లు వుంటే ఇప్పుడది ఏకంగా రూ.600 కోట్లు వరకూ ఉంటుందని సీఐడీ కోర్టుకు తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలని కోర్టుకు తెలిపిన సీఐడీ.. వారి స్టేట్ మెంట్ లను కూడా సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేసింది.
Translate this News: