క్వార్టర్ 180 రూపాయలా.. | CPI Narayana at Wine Shop | RTV
క్వార్టర్ 180 రూపాయలా.. | CPI Narayana goes to a Wine Shop and Inquires about Wine Prices newly Introduced by the Government in Andhra Pradesh | RTV
క్వార్టర్ 180 రూపాయలా.. | CPI Narayana goes to a Wine Shop and Inquires about Wine Prices newly Introduced by the Government in Andhra Pradesh | RTV
ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం కక్ష సాధింపుతో అన్న క్యాంటీన్లు మూసివేసి నిర్వీర్యం చేసిందన్నారు. గతంలో ప్రారంభించిన 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 10 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ కోసం డిసెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో పాటు మాజీ మంత్రి నారాయన, ఆయన అల్లుడు కేసులను కూడా హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.
తెలుగు బిగ్ బాస్ షో మీద సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్ అంటూ చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఏ సంబంధం లేని 50 మంది ఒకే ఇంట్లో ఉండడాన్ని ఏమంటారు అంటూ మండిపడ్డారు నారాయణ.
ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. నారాయణ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి తప్పుకున్నారు. దీంతో విచారణను ఏసీబీ కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.
మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. రాజధాని అమరావతి అసైన్ భూముల కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ను మరో రెండు వారాలు పొడిగించింది ఏపీ హైకోర్టు. నారాయణ దాఖలు చేసిన మరో నాలుగు బెయిల్ పిటిషన్లను హైకోర్టు వాయిదా వేసింది. ఆ పిటిషన్ల విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్, క్వాష్ పిటిషన్ వాయిదా పడ్డాయి. అసైన్ ల్యాండ్స్ కేసులో క్వాష్, బెయిల్ పిటిషన్లను సైతం వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ. బాబుతో ములాకత్ అయ్యేందుకు ముగ్గురూ జైలు లోపలికి వెళ్ళారు. ఈరోజు లోకేష్ కు సీబీఐ నోటీసులు ఇవ్వడానికి బయలుదేరిన విషయఆన్ని వీరు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కవితపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇస్తే కవిత హై కోర్టుకు వెళ్లిందన్న ఆయన.. కవిత చెప్పిన విషయాన్పి కోర్టు ఎలా నమ్మిందన్నారు.
వైసీపీ, బీజేపీలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ వైసీపీ పేర్లు వేరుగా ఉన్నా రెండు పార్టీలు ఒకటేనన్నారు. ఏపీలో మోడీ దత్త పుత్రుడుగా జగన్ వ్యవహరిస్తున్నాడంటూ మండిపడ్డారు. డబుల్ ఇంజన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం విధానం ప్రకటించిందన్నారు. ఫెడరల్ వ్యవస్థను నాశనం చేసేందుకే ఈ డబుల్ ఇంజన్ విధానం ప్రవేశ పెట్టారన్నారు.