అమరావతి అసైన్డ్ భూముల కేసు: సీఐడీ కీలక వాదనలు
బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో రూ.18 కోట్లు వుంటే ఇప్పుడది ఏకంగా రూ.600 కోట్లు వరకూ ఉంటుందని సీఐడీ కోర్టుకు తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలని కోర్టుకు తెలిపిన సీఐడీ.. వారి స్టేట్ మెంట్ లను కూడా సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేసింది.