అమరావతి అసైన్డ్ భూముల కేసు: సీఐడీ కీలక వాదనలు

బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో రూ.18 కోట్లు వుంటే ఇప్పుడది ఏకంగా రూ.600 కోట్లు వరకూ ఉంటుందని సీఐడీ కోర్టుకు తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలని కోర్టుకు తెలిపిన సీఐడీ.. వారి స్టేట్ మెంట్ లను కూడా సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేసింది.

New Update
అమరావతి అసైన్డ్ భూముల కేసు: సీఐడీ కీలక వాదనలు

అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తుది విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఐడీ కీలక వాదనలు వినిపించింది. కేవలం అమరావతిలో ఉన్న ఎస్సీల భూములను మాత్రమే నారాయణ బినామీల పేరుతో కొనుగోలు చేయించారని పేర్కొంది సీఐడీ. ఎస్సీల నుంచి భూములు కొని వారే హక్కుదారులుగా చూపించాలనే కుట్రతో జీవో 41 తీసుకొచ్చారని వెల్లడించింది. వీటికి రక్షణ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం లేకుండానే జీవో 41 తీసుకువచ్చారని కోర్టులో సీఐడీ వాదనలు వినిపించింది.

ఈ కేసులో బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో రూ.18 కోట్లు వుంటే ఇప్పుడది ఏకంగా రూ.600 కోట్లు వరకూ ఉంటుందని సీఐడీ కోర్టుకు తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలని కోర్టుకు తెలిపిన సీఐడీ.. వారి స్టేట్ మెంట్ లను కూడా సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేసింది. అలాగే ఈ వ్యవహారంపై సీజ్ చేసిన ఫోన్స్ లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర మాట్లాడుకున్న సంభాషణ రికార్డ్స్ కూడా ఉన్నట్లు సీఐడీ పేర్కొంది. నారాయణ, ఆయన కుమార్తె కాల్ రికార్డ్‌ను పెన్ డ్రైవ్‌ లో వేసి న్యాయమూర్తికి అందజేసింది. మాజీ సీఎం చంద్రబాబు అండగా ఉన్నారనే మంత్రిగా నారాయణ ఈ బినామీ లావాదేవీలు నిర్వమించారని సీఐడీ ఆరోపించింది.

భూముల కొనుగోలు విషయంలో అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతి లాల్, జేసీ చెరుకూరి శ్రీధర్ ఇబ్బందులు వస్తాయని హెచ్చరించినా.. నారాయణ పట్టించుకోలేదని సీఐడీ కోర్టుకు చెప్పింది. ఎఫ్ఐఆర్ ల మీద స్టే ఉంటే ఏ విధంగా విచారణ చేశారని పిటిషనర్ ప్రశ్నించగా.. అసైన్డ్ భూములకు సంబంధించి దాఖలైన వేరే కేసుల్లో సీఐడీ విచారణ చేయగా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఐడీ చెప్పింది. ఎఫ్ఐఆర్లు నమోదైన రోజుల వ్యవధిలోనే స్టే తెచ్చారని సీఐడీ వ్యాఖ్యానించింది. తుది విచారణలో భాగంగా గురువారానికి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. గురువారం పిటిషనర్ తరపున న్యాయస్థానం వాదనలు విననుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు