Allagadda : నాపై దాడి చేసింది వాళ్లే.. స్పందించిన అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్!

అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ తనపై జరిగిన హత్యాయత్నంపై స్పందించాడు. ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డిలే తనపై దాడిచేసినట్లు తెలిపాడు. ప్లాన్ ప్రకారమే తనను హతమార్చేందుకు ప్రయత్నించారన్నాడు. గతేడాది లోకేశ్‌ యువగళం పాదయాత్రలో జరిగిన గొడవే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Allagadda : నాపై దాడి చేసింది వాళ్లే.. స్పందించిన అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్!
New Update

Body Guard Nikhil : అఖిల ప్రియ(Akhila Priya) బాడీగార్డ్ నిఖిల్ తనపై జరిగిన హత్యాయత్నం(Murder) పై స్పందించాడు. ఏవీ సుబ్బారెడ్డి(AV Subba Reddy), భూమా కిషోర్ రెడ్డిలే తనపై దాడిచేసినట్లు తెలిపాడు. నంద్యాల(Nandyala) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నిఖిల్.. ప్లాన్ ప్రకారమే తనను హతమార్చేందుకు ప్రయత్నించారని చెప్పాడు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా వాహనంతో అతి వేగంగా వచ్చి తనను ఢీ కొట్టారు. వెంటనే ప్రమాదం నుంచి తేరుకుని అక్కడినుంచి పారిపోతుండగా తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారని ఆందోళన వ్యక్తం చేశాడు.

Also Read : పీసీసీ పదవి నుంచి దిగిపోనున్న రేవంత్ !.. రేసులో ఎవరున్నారంటే

భూమా వర్గీయులపై అనుమానం..
ఇక నిఖిల్ తలపై బలంగా గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అయిందా? ఇంకేదైనా ప్రమాదం ఉందా అనే కోణంలో పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం భూమా అకిలప్రియ ఇంటిముందు పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలావుంటే.. గతేడాది లోకేశ్‌ యువగళం పాదయాత్ర(Lokesh Yuvagalam Padayatra) లో ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిలో నిఖిల్‌ కీలక పాత్ర పోషించాడని, అందుకే ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులే నిఖిల్‌ ని హతమార్చేందుకు ఈ దాడి చేశారని భూమా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

#murder #akhila-priya #nikhil #allagadda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి