పాలిటెక్నిక్ పూర్తి చేశాక.. కొంతమంది విద్యార్థులు కుటుంబ పరిస్థితుల వల్ల బీటెక్ చేయకుండానే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతారు. అయితే ఇంతకుముందు ఉద్యోగం చేస్తూ ఇంజినీరింగ్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు వచ్చేశాయి. ఇంజినీరింగ్ చేయాలనే బలమైన కొరిక ఉంటే.. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టకుండా బీటెక్ చదువుకోవచ్చు. ఇలాంటి వారికి బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనే పేరుతో బీటెక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు ఇస్తారు. అయితే ఈ కోర్సును నిర్వహించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం 12 ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మధ్యే అనుమతినిచ్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు పలు కాలేజీల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ప్రవేశాలు కల్పించేందుకు (ఏఐసీటీఈ) పర్మిషన్ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..B.Tech: ఇకనుంచి ఉద్యోగం చేస్తూనే.. బీటెక్ చదవచ్చు
పాలిటెక్నిక్ (డిప్లొమా) పూర్తి చేశాక ఉద్యోగాలు చేసుకునే వారికి ఇంజినీరింగ్ చేసేందుకు AICTE రాష్ట్రంలో 12 ఇంజినీరింగ్ కళాశాలలకు ఇటీవలే పర్మిషన్ ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరంలో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలు పొందేందుకు నవంబర్ 30 వరకు అవకాశం ఉంది.
Translate this News: