AP Crime: తాడేపల్లిగూడెంలో మహిళ దారుణ హత్య!

ఆరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతి(48) అనే మహిళ అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది. వారం క్రితం ఆమె ఇంటి నుంచి ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి రాలేదు.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. ఈ ఉదయం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

New Update
Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థి మృతి

Ap Crime: తాడేపల్లి గూడెం అర్బన్‌ ఆరుళ్ల గ్రామ సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వారం క్రిత ఇంటి నుంచి ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఆరుళ్ల గ్రామ సమీపంలో కనిపించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతి(48) వారం క్రితం తాడేపల్లిగూడెంలోని బంధువుల ఇంట్లో నిర్వహించిన శుభకార్యానికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో వారు బంధువుల ఇంట్లో వాకబు చేయగా..ఎక్కడ ఆమె ఆచూకీ దొరకలేదు.

ఈ క్రమంలో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఆరుళ్ల గ్రామస్తులు రహదారికి సమీపంలో భరించలేని దుర్వాసన వస్తుందని అధికారులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, ఓ మహిళ మృతదేహన్ని గుర్తించారు. దానిని ఆరుగొలను గ్రామానికి చెందిన జనపాముల సత్యవతిగా గుర్తించారు.

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమెను గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

Also read: కుండపోత వానలకు ఉత్తరాది రాష్ట్రాలు కకావికలం

Advertisment
తాజా కథనాలు