Crime: హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి హాస్టల్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Suicide: ఇంకా ఎన్ని చూడాలి.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..
New Update

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. శనివారం ఉదయం.. తాను ఉంటున్న హాస్టల్‌లో ఉరి వేసుకుంది. ఆమెను చూసిన తొటి విద్యార్థులు ఒక్కసారిగా షాకైపోయారు. వెంటనే హాస్టల్‌ వార్డెన్‌కు ఈ విషయాన్ని అందించారు. అనంతరం వార్డెన్‌ ఈ విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు, అలాగే పోలీసులకు సమాచారమిచ్చింది.

Also Read: స్టంటర్ శ్రీకాంత్ రౌడీ, దొంగ, డ్రగ్గిస్ట్.. RTV రిపోర్టులో సంచలన నిజాలు

ఘటనాస్థలానికి వారు చేరుకోవడంతో.. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించగా.. తమ కూతురు మరణానికి కారణాలు చెప్పాలంటూ పోలీసులకు అడ్డుపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆ విద్యార్థిని తన సోదరుడితో మాట్లాడిందని ఆమె తోటి విద్యార్థులు పోలీసులకు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

Also Read: యూట్యూబ్‌లో వెయ్యికి పైగా ఆ వీడియోలు డిలీట్‌..

#suicide #crime-news #ap-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe