Vijayawada : విజయవాడలో దారుణం.. ప్రియరాలి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

AP: విజయవాడలో దారుణం జరిగింది. ప్రేమ విషయంలో మందలించడంతో ప్రియురాలి తండ్రిని అతి కిరాతకంగా కత్తితో మొఖంపై పొడిచి చంపేశాడు ఓ యువకుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Vijayawada : విజయవాడలో దారుణం.. ప్రియరాలి తండ్రిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
New Update

Vijayawada Killer : విజయవాడలోని బృందావన్ కాలనీలో హత్య (Kill) కలకలం రేపింది. సింధు భవన్ వద్ద కిరాణా షాపు వ్యాపారి హత్య జరిగింది. వ్యాపారి కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్టు (Love) సమాచారం. సదరు యువకుడిని మందలించడంతో హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేశారు. షాపు మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో కత్తితో దాడి ఆ యువకుడు చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆ వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు కృష్ణలంక పోలీసులు (Krishna Lanka Police). కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సామజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో ఆ యువకుడు తాను వ్యాపారి కూతురు ప్రేమించుకున్నామని.. అది తెలిసి ఆ వ్యాపారి 10 మందితో కలిసి తన ఇంటికి వచ్చి బెదిరించాడని చెప్పాడు. వ్యాపారి మాటలకు తన తల్లి చనిపోయింది అంటూ ఆ వ్యాపారిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.

Also Read : ఏడో తరగతి పాఠ్యాంశంగా హీరోయిన్ తమన్నా జీవితం.. మండి పడుతున్న తల్లి దండ్రులు!

#lovers #vijayawada #kill
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి