Telangana : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య..

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని.. ఓ వ్యక్తి మనస్తాపంతో ఉరేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం.. కోలనూర్ గ్రామంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Rajanna Sircilla :  రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని.. ఓ వ్యక్తి మనస్తాపంతో ఉరేసుకున్నాడు. కోనరావుపేట మండలం.. కోలనూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన గూడూరి సాగర్ (28) అనే ఆటోడ్రైవర్‌(Auto Driver).. అదే కాలనీకి చెందిన అనూష అనే అమ్మాయిని ఐదేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

Also Read : లక్షల ఎకరాలు కబ్జా.. జగదీష్ రెడ్డి వేముల వీరేశం సంచలన ఆరోపణలు

పెళ్లి తర్వాత అతడు అత్తవారింట్లోనే ఉంటూ జీవనం సాగించాడు. అయితే కొంత కాలం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు(Wife & Husband Fight) మొదలయ్యాయి. అంతేకాదు ఆ గొడవలు పంచాయతీల వరకు దారితీశాయి. ఈ క్రమంలోనే అనుషను ఇంటికి రావాలని సాగర్‌ కోరాడు. కానీ ఆమె రాలేదు. దీంతో ఆదివారం రాత్రి సాగర్‌.. తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. వాళ్లు రాత్రి నిద్రిస్తున్న సమయంలో.. సాగర్ చీరతో ఉరేసుకుని ఆత్మహత్య(Suicide) కు పాల్పడ్డాడు.

కొడుకు ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దీంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా సాగర్‌ ఇంటికి గుమికూడారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ గొడవలతో కొడుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడంపై.. సాగర్‌ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Also Read : ఖబడ్దార్.. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?

Advertisment
తాజా కథనాలు