HyderaBad: సెలున్‌ షాప్‌లో శానిటైజర్‌ తాగి అమ్మాయి మృతి..

హైదరాబాద్‌ మీర్‌పోట్‌లోని టీచర్స్‌ కాలనీలో దివ్య అనే అమ్మాయి సెలున్ షాప్‌లో శానిటైజర్ తాగి బలవన్మరణానికి పాల్పడింది. సెలున్ ఓనర్ మురళి..దివ్యపై అత్యాచారయత్నం చేయగా ఆమె కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన దివ్య శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది.

AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?
New Update

హైదరాబాద్‌ మీర్‌పోట్‌లోని టీచర్స్‌ కాలనీలో దారుణం జరిగింది. ఓ సెలున్ షాప్‌లో ఆ ఓనర్‌ దివ్య అనే అమ్మాయిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆమె పెద్దగా కేకలు వేయడంతో మురళి పరారయ్యాడు. అనంతరం దివ్య తీవ్ర మనస్తాపానికి గురైన ఆ సెలున్‌ షాప్‌లో ఉన్న శానిటైజర్ తాగి బలవన్మరణానికి పాల్పడింది. అయితే గతంలో మురళి.. దివ్యను పలుమార్లు రేప్ చేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Also Read: ఆర్టీసీ బస్సులో మహిళ ఆగమాగం..కండక్టర్ ను కాలితో తన్నిన వైనం

సెలున్‌ ముందు దివ్య కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అధికారికంగా ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌లు

#telugu-news #suicide #telangana-news #hyderabad-crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe