Telangana : దారుణం.. ఉద్యోగం రాక యువకుడు ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం జరిగింది. చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ గుప్త(22) ఉద్యోగం రాక తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.

AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?
New Update

Job : తెలంగాణ(Telangana) లో రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లాలో విషాదం జరిగింది. చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య(Suicide) చేసుకోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డి మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లవన్ కుమార్ గుప్త(22) అనే యువకుడు ఉద్యోగం(No Job) రాకపోవడంతో తీవ్రంగా మనస్థాపం చెందాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం వేకువజామున గ్రామ శివారులోని జక్కుల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also read: కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం

అతడిని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు లవన్ మృతదేహాన్ని బయటికి తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొడుకు మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read: ‘ఆఫ్టర్‌ 9’ పబ్‌పై దాడి.. 160 మంది స్టేషన్‌కు తరలింపు

#telugu-news #suicide #telangana-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి