రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాదిలో ఇది 11వ మరణం కావడం దుమారం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిహార్లోని మోతీహారీకి చెందిన ఆయుష్ జైస్వాల్ (17) గత రెండు సంవత్సరాలుగా కోటాలో ఐఐటీ-జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. స్నేహితులతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శనివారం రాత్రి ఆయూష్ గదినుంచి బయటకు రాకపోవడంతో అతడి స్నేహితులు ఇంటి యజమానికి చెప్పారు. ఎన్నిసార్లు పిలిచిన ఆయుష్ తలుపు తీయకపోవడంతో చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Kota: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 11వ ఘటన
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్న బీహార్కు చెందిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాదిలో ఇది 11వ మరణం కావడం దుమారం రేపుతోంది.
Translate this News: