/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-28-at-9.47.34-PM-jpeg.webp)
జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చేందారు. సమాచారం మేరకు పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చిని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also read: 2028లో చంద్రయాన్ -4 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో
బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళాఝూరియా రైల్వే స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అసాన్సోల్ - ఝూఝా మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also read: 2029 నుంచి జమిలి ఎన్నికలు..! కేంద్రానికి ప్రతిపాదన చేయనున్న లా కమిషన్